Greater Elections Results 2020: హైకోర్టు ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్న ఎలక్షన్ కమిషన్

| Edited By: Team Veegam

Dec 04, 2020 | 3:15 PM

హైకోర్టు ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. స్వస్తిక్‌ సహా ఇతర గుర్తును ఓటుగా లెక్కించాలని ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది.

Greater Elections Results 2020: హైకోర్టు ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్న ఎలక్షన్ కమిషన్
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎన్నికల సంఘం గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టి వేసిన విషయం తెలిసిందే. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఎన్నికల సంఘం వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని ఎన్నికల సంఘం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తోంది. ఈ రివ్యూ పిటిషన్‌ను స్వీకరించాలంటూ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయనుంది.

Read more:

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..