తెలంగాణ క‌రోనా బులిటెన్ కొత్త‌గా 1,842 కేసులు

|

Aug 24, 2020 | 9:59 AM

తెలంగాణలో కరోనా వైర‌స్ తీవ్ర‌త‌ కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,842 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ క‌రోనా బులిటెన్  కొత్త‌గా 1,842 కేసులు
Follow us on

తెలంగాణలో కరోనా వైర‌స్ తీవ్ర‌త‌ కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,842 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుద‌ల చేసింది. ఫ‌లితంగా రాష్ట్ర‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 1,06,091కి చేరింది. కొత్త‌గా మ‌రో ఆరుగురు కొవిడ్ కార‌ణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ క‌రోనా వ‌ల్ల చ‌నిపోయిన‌వారి సంఖ్య 761కి పెరిగింది. మరోవైపు నిన్న 1,825 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 82,411కి చేరింది.

తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్య‌ధికంగా 373, నిజామాబాద్‌ జిల్లాలో 158, కరీంనగర్‌ జిల్లాలో 134, సూర్యాపేట జిల్లాలో 113, రంగారెడ్డి జిల్లాలో 109 కేసులు న‌మోద‌య్యాయి.

 

Also Read : నేటి నుంచి డిగ్రీ ప్ర‌వేశాల రిజిస్ట్రేష‌న్

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్