ఒంటినిండా బంగారంతో గుడికెళ్లిన రౌడీ షీటర్.. రాజమర్యాదలు చేసిన పోలీసులు

| Edited By:

Jul 18, 2019 | 2:28 PM

తమిళనాడులోని మధురైలో రౌడీ షీటర్‌గా పేరొందిన వరిసూరి సెల్వం అనే వ్యక్తి ఒంటి నిండా బంగారంతో అత్తివరదర స్వామి దర్శనానికి వచ్చారు. అయితే ఆయనకు పోలీసులు రాజమర్యాదలతో స్వామి వారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు చేయించారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా వరిసూరి సెల్వంపై ఏకంగా 14కేసులున్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం వంటి కేసుల్లో అతడు ప్రధాననిందితుడిగా ఉన్నాడు . అయితే ఈయన గారికి మరో పిచ్చి ఉంది. ఒండినిండా బంగారం […]

ఒంటినిండా బంగారంతో గుడికెళ్లిన రౌడీ షీటర్.. రాజమర్యాదలు చేసిన పోలీసులు
Follow us on

తమిళనాడులోని మధురైలో రౌడీ షీటర్‌గా పేరొందిన వరిసూరి సెల్వం అనే వ్యక్తి ఒంటి నిండా బంగారంతో అత్తివరదర స్వామి దర్శనానికి వచ్చారు. అయితే ఆయనకు పోలీసులు రాజమర్యాదలతో స్వామి వారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు చేయించారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కాగా వరిసూరి సెల్వంపై ఏకంగా 14కేసులున్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం వంటి కేసుల్లో అతడు ప్రధాననిందితుడిగా ఉన్నాడు . అయితే ఈయన గారికి మరో పిచ్చి ఉంది. ఒండినిండా బంగారం వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక ఇలా ఒండి నిండా బంగారంతో తాజాగా అత్తివరదర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో పోలీసులు పక్కనుండి మరీ రాచమర్యాదలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.