భారత్ కు రష్యా మద్దతు..!

గాల్వన్‌లో చైనాతో హింసాత్మక సరిహద్దు ఘర్షణకు సంబంధించి భారత్ కు రష్యా తన బలమైన మద్దతును తెలిపింది. చైనా, భారత్ సమన్వయం పాటించాలని, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచన.

భారత్ కు రష్యా మద్దతు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 19, 2020 | 2:40 PM

గాల్వన్‌లో చైనాతో హింసాత్మక సరిహద్దు ఘర్షణకు సంబంధించి భారత్ కు రష్యా తన బలమైన మద్దతును తెలిపింది. భారత్-చైనా సరిహద్దులో జరుగుతున్న పరిణామాలను రష్యా గమనిస్తోందని ఆ దేశ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఓ ప్రకటన చేశారు. చైనా, భారత్ సమన్వయం పాటించాలని, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తేవడానికి ఇరు దేశాలూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భారత్, చైనాలతో తమకు చాలా సన్నిహిత, పరస్పర సంబంధాలు ఉన్నాయని పెస్కోవ్ వ్యాఖ్యానించారు. మరో పక్క జూన్ 23న భారత్, రష్యా, చైనా విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. గాల్వన్ లోయ వద్ద భారత్, చైనాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, సరిహద్దుల్లో చైనా, భారత్ ఘర్షణలతో విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదాపడుతుందనే ప్రచారం సాగింది. కానీ, షెడ్యూల్ ప్రకారమే జూన్ 23న సమావేశం జరుగుతుందని రష్యా విదేశాంగ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సారి సమావేశానికి ఛైర్మన్‌గా రష్యా వ్యవహరిస్తోంది. ఈ సమావేశంలో భారత్ తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా గాల్వన్‌ లోయ ఘర్షణను లేవనెత్తునున్నట్టు స్పష్టమవుతోంది. అటు, ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కోవిడ్-19 పరిస్థితులు, ఆర్ధిక సంక్షోభం తదితర అంశాలపై చర్చించనున్నారని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జాకరోవా తెలిపారు.