గుడ్ న్యూస్: బ్యాంకు ఉద్యోగులకు.. భారీగా పెరగనున్న వేతనాలు..

| Edited By:

Jul 23, 2020 | 1:07 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు, జీతాల కోతలతో చుక్కలు చూపుతుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో

గుడ్ న్యూస్: బ్యాంకు ఉద్యోగులకు.. భారీగా పెరగనున్న వేతనాలు..
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు, జీతాల కోతలతో చుక్కలు చూపుతుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే 8.5 లక్షల మందికి, 50వేల మంది పాత ప్రైవేటు రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు అందింది. పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనపెంపుతో పాటు పెన్షన్‌ కంట్రిబ్యూషన్‌ను నాలుగు శాతం పెంచేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది.

నవంబర్ 2017 నుండి జీతాల పెంపు వర్తిస్తుంది. పెన్షన్‌ కంట్రిబ్యూషన్, జీతాల పెంపుతో ఈ ఉద్యోగుల వార్షిక వేతన బిల్లు రూ 7900 కోట్ల మేర పెరగనుంది. కాగా, గతంలో ఈ ఉద్యోగుల బేసిక్‌ వేతనంలో 10 శాతం, డీఏ రిటైర్‌మెంట్‌ ప్రయోజనాల్లో కలుస్తుండగా, తాజా వేతన సవరణతో 14 శాతం బేసిక్‌, డీఏలు పెన్షన్‌ మొత్తానికి జమవుతాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు 5 శాతం అంతకుమించి నిర్వహణా లాభాలు ఆర్జించిన బ్యాంకుల ఉద్యోగులు ఇన్సెంటివ్‌లు అందుకోనున్నారు.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..