Ramnath Kovind: స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..

|

Mar 26, 2021 | 4:10 PM

భారత రాష్ట్రపతి ప్రధమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో ఢిల్లీలో ఆర్మ్ ఆస్పత్రిలో..

Ramnath Kovind: స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..
Ram Nath Kovind
Follow us on

Ramnath Kovind: భారత రాష్ట్రపతి ప్రధమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో ఢిల్లీలో ఆర్మ్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారని వైద్య సిబ్బంది చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ అండ్ ఆర్) హాస్పిటల్ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటన రామ్ నాథ్ ఆరోగ్యంపై ఒక ప్రకటన వెలువరించాయి. ఛాతీలో అసౌకర్యంగా ఉందని ఆసుపత్రిలో చేరారని చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సాధారణ పరీక్షలు చేయించుకున్నారని , ఇప్పుడు ఆయన అబ్జర్వేషన్లో ఉన్నారని వెల్లడించారు

ఆయితే కోవింద్ మార్చి 3న ఆర్మీ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఎటువంటి అస్వస్థతకు గురికాలేదు.. ఇక కోవింద్ భార్య సవితా కోవింద్ మార్చి 8 మహిళా దినోత్సవం రోజున కరోనా వాక్సిన్ తీసుకున్నారు.

Also Read:  రామరాజు లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్టేనా..? ఇప్పటి వరకూ ప్రిన్స్ వదులుకున్న హిట్ మూవీస్ ఏమిటో తెలుసా.?