బోధన్ ఆర్డీవో ఆఫీసు ముందు.. ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం!

బోధన్ మండలంలోని పెంటకుర్దు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు సోమవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. తమవెంట తెచ్చుకున్నపెట్రోల్ ను ఒంటిపై పోసుకున్నారు. ఆఫీసు వద్ద ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పెట్రోలు బాటిళ్లను లాక్కొన్నారు. గ్రామంలోని తమ వ్యవసాయ భూమిలోకి ప్రవేశించే దారిని మూసివేసి, పొరుగువారు ఒక గేటును నిర్మించారని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా […]

బోధన్ ఆర్డీవో ఆఫీసు ముందు.. ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం!
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 10:24 AM

బోధన్ మండలంలోని పెంటకుర్దు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు సోమవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. తమవెంట తెచ్చుకున్నపెట్రోల్ ను ఒంటిపై పోసుకున్నారు. ఆఫీసు వద్ద ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పెట్రోలు బాటిళ్లను లాక్కొన్నారు. గ్రామంలోని తమ వ్యవసాయ భూమిలోకి ప్రవేశించే దారిని మూసివేసి, పొరుగువారు ఒక గేటును నిర్మించారని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదన్నారు. వారి మనోవేదనను విన్న తరువాత, బోధన్ ఆర్డీఓ గోపిరామ్ న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకొవాలని తహసీల్దార్ ను ఆదేశించారు.