కేంద్రం సంచలన నిర్ణయం.. వలస కూలీల కోసం అద్దె ఇళ్లు..!

|

Jul 10, 2020 | 2:07 PM

కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం అద్దె ఇళ్లను సిద్దం చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో 70,000 ఇళ్లు సిద్దం అయ్యాయి. తాజాగా కేబినేట్ ఈ పధకానికి ఆమోదముద్ర వేసింది. ఈ పధకం అమలు చేసేందుకు మొదటి దశలో భాగంగా ఈ ఇళ్లను వలస కార్మికులకు అద్దెకు ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. స్థానిక ప్రభుత్వాలతో కలిసి వీటికి అద్దెను నిర్ణయించనుంది. ఉపాధి […]

కేంద్రం సంచలన నిర్ణయం.. వలస కూలీల కోసం అద్దె ఇళ్లు..!
Follow us on

కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం అద్దె ఇళ్లను సిద్దం చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో 70,000 ఇళ్లు సిద్దం అయ్యాయి. తాజాగా కేబినేట్ ఈ పధకానికి ఆమోదముద్ర వేసింది. ఈ పధకం అమలు చేసేందుకు మొదటి దశలో భాగంగా ఈ ఇళ్లను వలస కార్మికులకు అద్దెకు ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది.

స్థానిక ప్రభుత్వాలతో కలిసి వీటికి అద్దెను నిర్ణయించనుంది. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది వలస కూలీలు నగరాలకు వస్తుంటారు. వారందరికీ కూడా ఈ ఇళ్లు ఉపయోగకరంగా ఉంటాయని కేంద్రం భావిస్తోంది. అయితే కరోనా వైరస్ నేపధ్యంలో చాలామంది కూలీలు తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. వారిలో ఎంతమంది మళ్లీ తిరిగి వస్తారన్నది వేచి చూడాలి.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..

ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!

గుంటూరులో కరోనా టెర్రర్.. నేటి నుంచి కొత్త నిబంధనలు..