వైసీపీ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.. ఓర్వలేక కోర్టుల్లో కేసులు పెడుతున్నారు: మంత్రి అనిల్

ఈనెల 25న ఏపీలో అర్హులైన 15 లక్షల మందికి పక్కా ఇంటి స్థలాలను అందిస్తామని అన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్...

వైసీపీ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.. ఓర్వలేక కోర్టుల్లో కేసులు పెడుతున్నారు: మంత్రి అనిల్
Anil kumar yadav
Follow us

|

Updated on: Dec 22, 2020 | 2:14 PM

ఈనెల 25న ఏపీలో అర్హులైన 15 లక్షల మందికి పక్కా ఇంటి స్థలాలను అందిస్తామని అన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్. నెల్లూరు నగరంలో ఇవాళ పర్యటించిన మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు…ఇప్పటికే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సి వున్నా, టీడీపీ నేతలు పంపిణీని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా కోర్టులను ఆశ్రయించారని అన్నారు. అయితే కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాన్ని పక్కన పెట్టి, వివాదం లేని స్థలాల్ని లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అందన్నారు. వైసీపీ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేని టీడీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో కోర్టును ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు.