డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై దాడి.. 24 మంది మృతి..

| Edited By:

Jul 02, 2020 | 11:06 AM

మెక్సికోలో కొంతమంది దుండగులు మారణహోమం సృష్టించారు. ఈ ఘటన గువానాహువాటో రాష్ట్రం ఇరాపూవాటోలోని ఓ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో జరిగింది. ఈ దాడిలో ఏకంగా 24 మంది మరణించారు. అలాగే మరో ఏడుగురికి తీవ్ర గాయాలవ్వగా...

డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై దాడి.. 24 మంది మృతి..
Follow us on

మెక్సికోలో కొంతమంది దుండగులు మారణహోమం సృష్టించారు. ఈ ఘటన గువానాహువాటో రాష్ట్రం ఇరాపూవాటోలోని ఓ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో జరిగింది. ఈ దాడిలో ఏకంగా 24 మంది మరణించారు. అలాగే మరో ఏడుగురికి తీవ్ర గాయాలవ్వగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఈ కాల్పుల వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని, స్టానిక డ్రగ్ సరఫరాదారుల ముఠాకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మరోవైపు మెక్సికోలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం అక్కడ 2,26,089 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా 27,769 మంది మృతి చెందారు.

Read More:

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..

జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో.. స్కూల్‌ ఏజ్‌లోనే అదరగొట్టాడు..

పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..