జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలకు అందనంత దూరంలో ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 42 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ29, ఎంఐఎం 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. కాగా బాలాజీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శిరీష 2886 ఓట్లతో సమీప ప్రత్యర్థిపై గెలిచారు. కేపీహెచ్బీ టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావు 2010 ఓట్లతో విజయం సాధించారు. అల్లపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి సబియా గౌసుద్దీన్ విజయకేతనం ఎగురేశారు. మూసాపేట్లో మాత్రం అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి మహేందర్ 600 ఓట్లతో సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో కార్యకర్తలు గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు.
GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..