Breaking : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి, ప్రణబ్ ముఖర్జీకి కరోనా బారిన పడ్డారు. ఆయన ఈ రోజు నార్మల్ చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్లారు.
Pranab Mukherjee tests positive for coronavirus : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడ్డారు. ఆయన ఈ రోజు నార్మల్ చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్లందరూ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని ప్రణబ్ సూచించారు. వారందరూ.. కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు దేశానికి 13వ భారత రాష్ట్రపతిగా సేవలందించారు. ప్రణబ్కు కోవిడ్ సోకిందని తెలిసి..అనేకమంది పార్టీ సహచరులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆకాంక్షించారు.
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today. I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee
— Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020
Also Read : బంగాళాఖాతంలో అల్పపీడనం : తెలంగాణలో విస్తారంగా వర్షాలు