Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…

|

Dec 31, 2020 | 7:06 PM

మందుబాబులకు గుణపాఠం చెప్పడానికి ఏకంగా సైబరాబాద్‌ సీపీ  సజ్జనార్ రంగంలోకి దిగారు. రోడ్డుపైనే కౌన్సిలింగ్ ఇచ్చి..తాగి బండి నడపడం తప్పు కదా అని ప్రశ్నించారు.

Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు...విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్...
Follow us on

మందుబాబులకు గుణపాఠం చెప్పడానికి ఏకంగా సైబరాబాద్‌ సీపీ  సజ్జనార్ రంగంలోకి దిగారు. రోడ్డుపైనే కౌన్సిలింగ్ ఇచ్చి..తాగి బండి నడపడం తప్పు కదా అని ప్రశ్నించారు. తాగి డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమయ్యే వారు టెర్రరిస్టులతో సమానమని పేర్కొన్నారు. తాగుబోతులు డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఉద్యోగులు తాగి వాహనం నడిపితే..వారి ఆఫీసులకు లేఖ రాస్తామని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులపై కాలేజీలకు లేఖలు పంపుతామని..తాగి వాహనం నడిపి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. కొత్త సంవత్సరం వేడుకలకు తాను వ్యక్తిగతంగా దూరంగా ఉంటున్నట్లు సజ్జనార్ తెలిపారు. గత సంవత్సర కాలం నుంచి గమనిస్తే..30 నుంచి 40 శాతం ప్రమాదాలకు కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ అని వివరించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేవారంతా..తాగి వాహనం నడపనని ప్రమాణం చేయాలని కోరారు. తాగి వాహనం నడిపితే ఎంత ప్రమాదమో తెలిసి కూడా..అలా చేసేవారిని టెర్రరిస్టులు కాకుండా..ఏమని పిలవాలో చెప్పాలన్నారు.

Also Read : 

Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

 Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !