ఏపీలో కీలక పరిణామం.. గవర్నర్ చెంతకు సీఆర్డీఏ, మూడు రాజధానుల బిల్లులు..!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానులు) బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన కు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభం
CRDA Cancellation Bill: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానులు) బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఓవైపు కరోనా తీవ్రత ఉండగా.. ఇప్పుడు మూడు రాజధానుల అంశం అవసరమా? అని టీడీపీ ప్రశ్నించింది. వివాదాస్పదమైన బిల్లులపై గవర్నర్ అలోచించి నిర్ణయం తీసుకోవాలంది. ఈ క్రమంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: విధులకు హాజరు కాకపోతే.. రిటైర్మెంటే గతి ..!