ప్రమాదవశాత్తు 40 అడుగుల బావిలో పడిన పాడి ఆవును పలమనేరు అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి కాపాడారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంట గ్రామానికి చెందిన చలపతి అనే రైతుకు చెందిన పాడిఆవు ఆదివారం గడ్డి మేసుకుంటూ ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటాని సంఘటనా స్థలానికి చేరుకున్నారు..రెండు గంటలకు పైగా శ్రమించి బావిలో పడిన పాడిఆవును బయటకు తీసి కాపాడారు. వెంటనే పశువైద్యశాలకు తరలించి చికిత్స అందజేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మీసం మెలేసి.. బ్రాండ్ అంబాసిడర్గా మారిన మహిళ! వీడియో
Samantha: జోరు వానలో.. సైకిల్ పై జాలీగా సామ్.. వీడియో