ఉత్తర్ప్రదేశ్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ కరోనా బాధిత మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని గోరఖ్పుర్ బీఆర్డీ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నవజాత శిశువుల్లో ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని, నాలుగో చిన్నారిని వెంటిలేటర్పై ఉంచినట్లు వివరించారు. తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే… నెలలు నిండకముందే డెలివరీ అయినట్లు డాక్టర్లు తెలిపారు. నలుగురు చిన్నారులు 980 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదని, చాలా సవాలుతో కూడుకున్న డెలివరీ అని బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. నలుగురు పిల్లల నుంచి కూడా శాంపిల్స్ సేకరించి, కరోనా టెస్టుల కోసం మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ కు పంపినట్టు వివరించారు.
“దేవరియా జిల్లాలోని గౌరీ బజార్లో నివసిస్తున్న 26 ఏళ్ల మహిళ మంగళవారం రాత్రి మెడికల్ కాలేజీలోని ట్రామా సెంటర్కు చేరుకుని కరోనా టెస్టులు చేయించుకుంది. ఈ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అత్యంత సమర్థమైన వైద్యులు, పారామెడికల్ టీమ్ వైద్యం అందించగా.. బుధవారం నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ” అని బీఆర్డీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read :
హేమంత్ పరువు హత్య కేసులో 12 మంది అరెస్ట్..