హేమంత్ పరువు హత్య కేసులో 13 మంది అరెస్ట్..

హైదారాబాద్ నగరంలో మరో పరువు హత్య కేసు కలకలం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసున్న యువ జంటపై యువతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు.

హేమంత్ పరువు హత్య కేసులో 13 మంది అరెస్ట్..
Follow us

|

Updated on: Sep 25, 2020 | 11:58 AM

హైదారాబాద్ నగరంలో పరువు హత్య కేసు కలకలం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై యువతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. యువకుడిని కిడ్నాప్ చేయించి అతి కిరాతంగా మర్డర్ చేయించాడు. ఈ హత్య సమయంలో  పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మరణించిన హేమంత్ భార్య అవంతి ఆరోపిస్తోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. అవంతి బంధువులు మొత్తం ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యారని, మహిళలు కూడా ఉన్నారని తెలిపారు.

నిన్న సాయంత్రం 4 గంటలకు హేమంత్, అవంతిలను దుండగులు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. హేమంత్ తండ్రి 100 కు డయల్ చేసి సమాచారం ఇచ్చారని, పెట్రోలింగ్ వాహనం వెళ్లేసరికి అవంతి ఆ ప్రదేశంలో లేదని తెలిపారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అవంతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని, ఆ సమయానికే హేమంత్ ను చంపేశారని పోలీసులు వివరించారు. హత్యలో అవంతి తండ్రి లక్ష్మారెడ్డితో పాటు ఇతర బంధువులది ప్రధాన పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Also Read :

దేశంలో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1,141 మరణాలు