‘పబ్జీ’ ప్రేమాయణం, చివరకు !
ఆన్లైన్ గేమ్ పబ్జీలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయింది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులోని తిరువత్తర్ జిల్లాలో జరిగింది.
ఆన్లైన్ గేమ్ పబ్జీలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయింది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులోని తిరువత్తర్ జిల్లాలో జరిగింది. యువతి పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ పబ్జీ ప్రేమ వ్యవహారం బయటపడింది.
కరోనా లాక్డౌన్ సమయంలో.. బబిష అనే 20ఏళ్ల యువతి పబ్జీ ఆడటం స్టార్ట్ చేసింది. ఆటలో భాగంగా అజిత్ ప్రిన్స్(24)ను ఆన్లైన్లో కలుసుకుంది. క్రమక్రమంగా ఇరువురి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కొద్ది రోజులకు అది ప్రేమగా మారింది.ఈ నెల 19న అజిత్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది బబిష. కూతురు కనపడకపోవడం వల్ల తిరువత్తర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు బబిష-అజిత్ కనపడ్డారు. అనంతరం ఈ ప్రేమ జంట పోలీసు స్టేషన్లో లొంగిపోయింది. అయితే బబిష ప్రేమను ఆమె పేరెంట్స్ అంగీకరించలేదు. అయినప్పటికీ.. వారు పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. దీంతో పోలీసుల సమక్షంలో దగ్గర్లోని దేవాలయంలో వారి వివాహం జరిగింది.