గుడ్ న్యూస్.. ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. 8 లక్షల యాభై వేలు దాటిన రికవరీలు..
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 381 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,68,064కి చేరింది.
Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 381 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,68,064కి చేరింది. ఇందులో 7840 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,53,232 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 4 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,992కు చేరుకుంది. ఇక నిన్న 934 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,00,57,854 సాంపిల్స్ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 21, చిత్తూరు 31, తూర్పుగోదావరి 45, గుంటూరు 35, కడప 26, కృష్ణా 70, కర్నూలు 12, నెల్లూరు 19, ప్రకాశం 7, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 11, విజయనగరం 20, పశ్చిమ గోదావరి 74 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,291కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 827 మంది కరోనాతో మరణించారు.
#COVIDUpdates: 30/11/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,65,169 పాజిటివ్ కేసు లకు గాను *8,50,337 మంది డిశ్చార్జ్ కాగా *6,992 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,840#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/tWeZOQmrVU
— ArogyaAndhra (@ArogyaAndhra) November 30, 2020