CM Jagan Welcome to President: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం పలికిన సీఎం జగన్..

|

Feb 07, 2021 | 1:59 PM

చిత్తూరు జిల్లాలోని ఒక్కరోజు పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘన స్వగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు...

CM Jagan Welcome to President: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం పలికిన సీఎం జగన్..
Follow us on

CM Jagan Welcome to President: చిత్తూరు జిల్లాలోని ఒక్కరోజు పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘన స్వగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్‌ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదనపల్లె సమీపంలోని సత్సంగ్‌ ఫౌండేషన్‌ వద్దకు రాష్ట్రపతి చేరుకున్నారు.

అక్కడ సత్‌సంగ్‌ ఆశ్రమం, శంకుస్థాపన, భారత యోగా విద్యా కేంద్రాన్ని కోవింద్ ప్రారంభించనున్నారు. సత్సంగ్‌ విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సదుం మండలం పీపుల్స్‌గ్రోవ్‌ స్కూలుకు చేరుకుని విద్యార్థులతో ముచ్చటించనున్నారు రాష్ట్రపతి కోవింద్

Also Read:

: నేటి నుంచి ప్రేమికుల వారం మొదలు.. ఈ రోజు నుంచి 7రోజులు ఏయే బహుమతులు ఇస్తారో తెలుసుకుందాం..!

ఉత్తరాఖండ్‌లో వరద కలకలం.. విరిగిపడ్డ కొండచరియలు.. గ్రామం జలసమాధి..