బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు. అంతలోనే..

|

Jun 11, 2020 | 1:32 PM

బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు తోటి ప్రయాణికులు అంతలో ఆ వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు. అంతలోనే..
Follow us on

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బస్సులో దగ్గుతున్న వ్యక్తిని కిందికి దింపేశారు తోటి ప్రయాణికులు. అంతలోనే ఆ వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సకాలంలో చికిత్స అందక ఓ అస్తమా పేషెంట్ ​మరణించాడు.
హైదరాబాద్ లోని నేరేడ్​మెట్​కు చెందిన శ్రీనివాస్ బాబు(54) సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ తీవ్రంగా దగ్గుతుండడంతో తోటి ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. మెదక్​ జిల్లా చేగుంట సమీపంలో రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ దగ్గర బస్సులోంచి ఆయనను దింపేశారు. చేగుంట పట్టణం వైపు నడుచుకుంటూ వెళ్లిన ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కిందపడిపోయారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చుట్టుపక్కల వాళ్లకు చెప్పడంతో కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానించి పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకునేసరికే అతడు ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్ బాబుకు ఆస్తమా ఉందని కుటుంబీకులు తెలిపారు.