మంత్రి బొత్స ఇంట తీవ్ర విషాదం

|

Aug 16, 2020 | 7:50 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్పిప‌ల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. బొత్స త‌ల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు.

మంత్రి బొత్స ఇంట తీవ్ర విషాదం
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్పిప‌ల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. బొత్స త‌ల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. గ‌త నెల రోజులుగా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మవుతోన్న ఈశ్వరమ్మ..విశాఖలోని పినాకిల్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మినిస్ట‌ర్ బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా… రెండో త‌న‌యుడు బొత్స అప్పల నరసయ్య శాస‌న‌స‌భ్యుడిగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్ఘధామంలో ఈశ్వరమ్మ‌ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగా ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ప‌లువురు వైసీపీ నేత‌లు బొత్స‌కు ఫోన్ చేసి పరామ‌ర్శించారు.

 

Also Read :

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు

 

గుడ్ న్యూస్ : తెలంగాణలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు