ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిసెంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ ప్రకటనలో తెలిపారు.

ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిసెంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ
Follow us

|

Updated on: Nov 30, 2020 | 8:33 PM

తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం న‌వంబ‌ర్ 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌ యూజీ -2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1 ఉదయం 8 గంటల నుంచి 7 వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైటు www .knruhs.telangana.gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.