కన్నడ నటి రాగిణి ద్వివేదీకి 14 రోజుల జుడిషియల్ కస్టడీ
డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదీని బెంగుళూరు లోని అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో రాగిణితో బాటు సంజనా గల్రానీని కూడా సెంట్రల్ క్రైమ్ బ్రాంచి అధికారులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ కేసులో కన్నడ నటి రాగిణి ద్వివేదీని బెంగుళూరు లోని అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో రాగిణితో బాటు సంజనా గల్రానీని కూడా సెంట్రల్ క్రైమ్ బ్రాంచి అధికారులు అరెస్టు చేశారు. రాగిణితో సహా మరో నలుగురిని కూడా పధ్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి తరలించినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు. సంజనాను మరో అయిదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచి కోరినప్పటికీ కోర్టు అందుకు అంగీకరించలేదు. రాగిణి, సంజనా ఇద్దరికీ కరోనా వైరస్ టెస్ట్ నిర్వహించగా ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. రాగిణిని బెంగుళూరులోని సెంట్రల్ జైలుకు తరలించారు.