IPL 2020 Virat Kohli: సన్రైజర్స్ హైదరాబాద్పై విజయంతో ఈ సీజన్లో మంచి శుభారంగం చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. ఆ తరువాత పంజాబ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. పంజాబ్తో ఆటలో కోహ్లీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. కోహ్లీని ట్రోల్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక ఈ ఓటమితో డీలా పడి ఒత్తిడితో ఉన్న ఆర్సీబీకి మరో షాక్ తగిలింది. పంజాబ్తో ఆడిన ఆటలో స్లో ఓవర్ రేటుకు పాల్పడినందుకు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు జరిమానాకు విధించారు. అతడికి రూ.12 లక్షల ఫైన్ విధిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.
Read More:
Bigg Boss 4: కొత్త టాలెంట్ చూపించిన అఖిల్.. అందరూ ఇంప్రెస్
Bigg Boss 4: సాక్షి దీక్షిత్ ఎంట్రీ.. పులిహోర స్టార్ట్ చేసిన అభిజిత్