Viral: పాత కట్టడమే కదా అని కూల్చేశారు.. కానీ.. శిథిలాల్లో దొరికిన 200 ఏళ్ల నాటి వస్తువుని చూసి నోరెళ్లబెట్టారు..

|

May 25, 2022 | 9:25 AM

ఝుంఝును జిల్లాలో మన్ననాథ్ ఆశ్రమం ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. 200 ఏళ్ల నాటి ఓ పదార్థం బయటపడడంతో, దానిని చూసేందుకు భక్తులు మఠానికి చేరుకుంటున్నారు.

Viral: పాత కట్టడమే కదా అని కూల్చేశారు.. కానీ.. శిథిలాల్లో దొరికిన 200 ఏళ్ల నాటి వస్తువుని చూసి నోరెళ్లబెట్టారు..
Viral News
Follow us on

పాత కట్టడమని, కూల్చేసి కొత్తగా నిర్మిద్దామని అనుకున్నారు. తీరా ఎన్నో ఏళ్ల నాటి ఈ పురాతన కట్టడాన్ని ఎట్టకేలకు కూల్చేశారు. అయితే, శిథిలాలను తొలగిస్తున్నప్పుడు ఓ లోహపు బంతి దొరికింది. అది ఏంటాని ఆసక్తిగా చూసిన జనాలు ఆశ్చర్యపోయేలాంటి ఓ పదార్థం అందులో కనిపించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. దీనిని చూసేందుకు ఆ చుట్టుపక్కల జనాలు తెగ ఎగబడి వస్తున్నారు. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలోని మన్ననాథ్ ఆశ్రమంలో జరిపిన తవ్వకాల్లో 200 ఏళ్ల నాటి నెయ్యి బయటపడింది. ఈ తవ్వకాల్లో చాలా నెయ్యి దొరికింది. అనంతరం ఇది పరీక్ష కోసం పంపించారు. తాయ్ గ్రామంలో నిర్మించిన ఈ ఆశ్రమ చరిత్ర సుమారు రెండు వేల సంవత్సరాల నాటిది. మఠం తవ్వకంలో బయటపడిన ఈ నెయ్యి మొత్తం షెకావతిలో చర్చనీయాంశంగా మారింది. మఠం గోపురం నుంచి వెలువడిన నెయ్యి కుండను చూసేందుకు భక్తులు మఠానికి చేరుకుంటున్నారు.

నెల రోజుల క్రితం ఆశ్రమంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. కొత్త రూపాన్ని ఇచ్చేందుకు గోపురం కూల్చివేశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు గోడలో లోహపు బంతిని గుర్తించారు. అది నెయ్యితో నిండి ఉంది. మహంత్ సోమనాథ్ ప్రకారం, ఈ మఠం వందల సంవత్సరాల పురాతనమైనది. నిర్మాణ సమయంలోనే నెయ్యి కలశం శిఖరంలో ఉంచారని’ తెలిపారు.

ఆశ్రమం చరిత్ర..

ఇవి కూడా చదవండి

జుంజును ప్రధాన కార్యాలయం నుంచి చురు రోడ్డులో దాదాపు 35 కి.మీ దూరంలో ఈ మన్ననాథ్ పంతీస్ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమ చరిత్ర చాలా పురాతనమైనది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈ ఆశ్రమ చరిత్ర సుమారు రెండు వేల సంవత్సరాల నాటిది. రాజు తన రాజభవనాన్ని వదిలి తపస్సుకు వచ్చాడు. అయితే, గుర్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ తపస్సు చేయాలని బాబా గోరఖ్‌నాథ్ చెప్పాడంట. దీంతో గుర్రం ఈ ప్రదేశంలో ఆగింది. రాశాలుడు ఇక్కడ తపస్సు చేశాడు. గోరఖ్‌నాథ్ తన శిష్యుడిని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. రాశాలుడు తపస్సులో మునిగిపోయాడు. బాబా గోరఖ్‌నాథ్ అతనికి మన్ననాథ అని పేరు పెట్టారు. అప్పుడే మన్నా నాథుల ఆరాధన మొదలైంది. గ్రామస్తుల ప్రకారం, ఈ మఠం ఇసుక దిబ్బ నుంచి ప్రారంభించారు. దీని ఆధారంగా ఈ గ్రామానికి తై అని పేరు పెట్టారు. 105 సంవత్సరాల క్రితం ఈ మఠాన్ని ఇటుక రాళ్లు, మట్టితో నిర్మించారని తెలుస్తోంది.