వాస్తుకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలంటే ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం ఉండాలని భావించే వాళ్లు చాలా మంది ఉంటారు. అందుకే వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు.
అయితే మనకు తెలిసో తెలియకో కొన్ని వాస్తు దోషాలు ఇంట్లో ఉండే ఉంటాయి. వీటివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈశాన్యంలో చెత్తాచెదారం ఉండడం, బాత్రూమ్లు సరైన దిశలో ఉండకపోవడం ఇలా పలు దోషాల కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా.? లేదా.? అనే విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* రాత్రుళ్లు కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే పీడ కలలు వస్తూంటే మాత్రం ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే వాస్తు పండితులను సంప్రదించి వాస్తును చూపించుకోవాలి.
* ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, ఆత్మహత్య చేసుకోవాలి, ఏదో తెలియని ఆందోళన వంటి సమస్యలు వేధిస్తుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా ఏదో తెలియని దుర్వాసన వస్తుంటే ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలా ఉంటే నీటిలో కర్పూరం వేసి ఫ్లోర్ను శుభ్రం చేసుకోవాలి.
* కుటంబ సభ్యుల మధ్య సక్యత లేకపోయినా, నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతున్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి.
* దీర్ఘకాలంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా. సంపాదించిన డబ్బు సపాదించినట్లు ఖర్చవుతున్నా. ఇంట్లో నెగిటివ్ ఉండొచ్చని వాస్తు పండితులు చెబతుఉన్నారు.
* ఇక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు నిత్యం అనారోగ్యాల బారిన పడుతున్నా, ఆసుపత్రుల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నా. ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..