Farmers protest: కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు.. కొత్త సాగు చట్టాల రద్దుపై చర్చించాలన్న రైతులు

ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు....

Farmers protest: కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు.. కొత్త సాగు చట్టాల రద్దుపై చర్చించాలన్న రైతులు
Follow us

|

Updated on: Dec 29, 2020 | 6:19 PM

ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రైతు సంఘాలను ఈనెల ఈనెల 30న మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు ఆహ్వానించింది. అయితే ముందుగా చర్చలకు నిరాకరించిన రైతు సంఘాలు .. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించాయి. కేంద్రంతో రైతు సంఘాలు భేటీ కానున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి సంయుక్తంగా కిసాన్ మోర్చా లేఖ రాసింది. నాలుగు అంశాల అజెండాను పునరుద్ఘాటించిన రైతు సంఘాలు.. కొత్త సాగు చట్టాల రద్దుపై చర్చించాలని కోరాయి.

కాగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తొలగించే అంశం, కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ ఇవ్వడం, పంట వ్యర్థాలు తగులబెట్టిన విషయంలో నమోదుచేసిన కేసులను ఎత్తివేయడం, విద్యుత్‌ ముసాయాదా బిల్లు -2020లో మార్పులు తదితర అంశాలను ఎజెండాలో తప్పనిసరిగా చేర్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మళ్లీ చర్చలకు వస్తామని రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. మరి ఈ చర్చల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.