Renu Desai: సర్జరీ చేయించాలి.. దయచేసి సాయం చేయండి.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

|

Jul 21, 2024 | 8:01 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పవన్ ను ప్రేమించే అమ్మాయిగా కనిపించారు ఆమె. ఆతర్వాత పవన్ తో జానీ సినిమాలో కనిపించారు. ఇక ఆమె పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న విషయం విడిపోయిన విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచుతున్నారు.

Renu Desai: సర్జరీ  చేయించాలి.. దయచేసి సాయం చేయండి.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
Renu Desai
Follow us on

ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రేణు దేశాయ్. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు రేణు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పవన్ ను ప్రేమించే అమ్మాయిగా కనిపించారు ఆమె. ఆతర్వాత పవన్ తో జానీ సినిమాలో కనిపించారు. ఇక ఆమె పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న విషయం విడిపోయిన విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచుతున్నారు. ఎవరిమీద ఆధారపడకుండా జీవిస్తున్నారు. ఇటీవలే టైగర నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు రేణు.

ఇది కూడా చదవండి : Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..

ఇక సోషల్ మీడియాలో రేణు దేశాయ్ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన పిల్లల గురించి, అలాగే సమాజంలో జరిగే సంఘటనల గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే తన పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి కూడా గట్టిగానే రిప్లే ఇస్తూ ఉంటారు రేణు దేశాయ్. ఎంతమంది తనను ట్రోల్ చేసిన పిచ్చి పిచ్చి కామెంట్స్ తో విసిగించిన దైర్యంగా ఆమె వారికి బుద్దోచేలా సమాధానం చెప్తూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా సాయం చెయ్యండి అంటూ కోరారు.

ఇది కూడా చదవండి : వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

రేణు దేశాయ్ పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా యాక్టీవ్‌గా ఉంటారు. రీసెంట్ గా ఆమె ఓ పెట్ కు సర్జరీ చేయించాలి అని పోస్ట్ షేర్ చేశారు. ఓ పెట్‌ డాగ్ కు సర్జరీ చేయించాలని, దయచేసి సాయం చేయండి. ఆ పెట్ కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా దాని ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ పోస్ట్ షేర్ చేశారు. అయితే ఆమె పోస్ట్ పై స్పందించింది ఎక్కువ మంది విరాళాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీని పై ఆమె స్పందిస్తూ.. నా ఇన్ స్టాకు దాదాపు 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.. కానీ కేవలం పది మంది మాత్రమే విరాళం ఇచ్చారని తెలిపారు. జంతువుల పై ప్రేమ ఉన్నవారు ఎక్కువమంది స్పందిస్తారని అన్నని కానీ ఇది నేను ఊహించలేదు అని ఆమె తెలిపారు. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటికైనా జంతుప్రేమికులు రేణుదేశాయ్ పోస్ట్ పై స్పందించి విరాళాలు ఇవ్వాలని నెటిజన్స్ కోరుతున్నారు.

రేణు దేశాయ్ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.