Samantha: ఆ ఇల్లే కావాలని సమంత ఎక్కువ రేటు పెట్టి కొన్నది.. మురళీమోహన్ ఆసక్తికరం కామెంట్స్

|

Jul 29, 2022 | 7:36 AM

టాలీవుడ్ బ్యూటీ సమంత(Samantha)గురించి నిత్యం ఎదో ఒక వార్త మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. అక్కినేని నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సామ్ గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.

Samantha: ఆ ఇల్లే కావాలని సమంత ఎక్కువ రేటు పెట్టి కొన్నది.. మురళీమోహన్ ఆసక్తికరం కామెంట్స్
Samantha
Follow us on

టాలీవుడ్ బ్యూటీ సమంత(Samantha)గురించి నిత్యం ఎదో ఒక వార్త మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. అక్కినేని నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సామ్ గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ చిన్నది ఆతర్వాత అతడి నుంచి విడిపోయింది. పెళ్ళి తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకున్న సామ్. విడాకుల తర్వాత మాత్రం రెచ్చిపోతోంది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అటు సినిమాలపరంగాను దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ భాషలతో పాటు బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటోంది సామ్. తాజాగా సామ్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సమంత నాగ చైతన్య గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

నాగచైతన్య – సమంత కలిసి పెళ్లి తర్వాత మా ఇల్లు కొనుక్కున్నారు అన్నారు మురళీ మోహన్. ఇద్దరు కలిసి పెళ్లితర్వాత అందులోనే కలిసి ఉన్నారు. ఆ తర్వాత మరో ఇల్లు కొనుక్కున్నారు. అనుకోని ఆ ఇంటిని అమ్మేశారు. అయితే కొనుకున్న కొత్త ఇల్లు రీమోడలింగ్‌ చేస్తున్నారని అంతవరకు ఇక్కడే ఉంటామని చెప్పారని మురళీమోహన్ అన్నారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. సమంత బయట ఎక్కడో ప్రయత్నించింది. అయితే సామ్ కు ఎక్కడ ఇల్లు నచ్చక పోవడంతో మళ్లీ మా ఇల్లే కావాలని వచ్చి అడిగింది. అయితే అప్పటికే కొనుకున్న వారు ఇల్లు అమ్మడం కుదరదని చెప్పారు. అయినా వినకుండా సమంత ఎక్కువ డబ్బులిచ్చి ఆ ఇంటిని కొనుకుంది. ఇప్పుడు తన తల్లితో కలిసి ఆ ఇంట్లోనే ఉంటోంది అని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి