NTR : “గాయత్రి గారి మరణం చాలా విషాదకరం”.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

|

Oct 05, 2024 | 10:33 AM

కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరు అయ్యారు.. కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో నిన్న ఆమెను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు.

NTR : గాయత్రి గారి మరణం చాలా విషాదకరం.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Ntr
Follow us on

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి (38) మృతి చెందారు. నిన్న కార్డియాక్ అరెస్టు తో AIG ఆసుపత్రిలో చేరిన ఆమె 12 గంటలు ట్రీట్మెంట్ తరువాత కన్నుమూశారని తెలుస్తోంది. కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరు అయ్యారు.. కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో నిన్న ఆమెను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్‌లో ఉంది రాజేంద్రప్రసాద్‌ కుటుంబం.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో గాయత్రి భౌతికకాయానికి కుటుంబసభ్యులు నివాళి అర్పిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి చేరుకొని గాయత్రి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు. కొంతమంది సినీ ప్రేముఖులు సోషల్ మీడియా ద్వారా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశారు.

“నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని తారక్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి