Keerthy Suresh : అందాల భామ కీర్తి సురేష్ తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ను సొంతం చేసుకుంది ఈ భామ . తెలుగులో రామ్ నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత మహానటి సినిమాతో మరింత దగ్గరయింది. ఇక స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగుతోపాటు తమిళ్ సినిమాల్లో నటిస్తుంది కీర్తిసురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటిస్తుంది. సర్కారు వారు పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు సరసన మొదటి సారి నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా భోలా శంకర్
లో నటిస్తుంది. అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలోనూ కీర్తిసురేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.
దళపతి విజయ్తో కీర్తిసురేష్ రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మురగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ సినిమాతోపాటు భైరవ అనే సినిమా చేసింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మూడోసారి విజయ్ తో నటించనుందని తెలుస్తుంది. దళపతి విజయ్ తో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ బీస్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరవాత వంశీ సినిమా పట్టాలెక్కనుంది. రీసెంట్ గా బీస్ట్ సినిమా షూటిగ్ కంప్లీట్ చేశాడు దళపతి. ఇప్పుడు వంశీ సినిమా షురూ కానుంది. అయితే ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా ఎంపికైందని టాక్ వినిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ని కొన్ని నెలల క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ తో మరోసారి కీర్తి నటిస్తుందన్న దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :