హీరోల్లో అజిత్(Ajith Kumar)చాలా డిఫరెట్.. కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ.. గ్యాప్ దొరికితే బైక్ ఏసుకొని రయ్యిమంటూ రైడ్ లకు వెళ్తుంటారు. ఆయనకు బైక్ రేస్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట అజిత్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇటీవలే వలిమై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్. తాజాగా అజిత్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ బైక్ రైడ్ చేస్తూ ఫ్యాన్స్ కంటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అజిత్ కనిపిస్తే చాలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అభిమానులు. ఇప్పుడు అజిత్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోడ్ ట్రిప్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అజిత్. తాజాగా వైజాగ్ వెళ్లారు. ప్రస్తుత అజిత్ నటిస్తోన్న సినిమావైజాగ్ లోని అరకులో షూటింగ్ జరుపుతున్నారు. అయితే విశాఖపట్నం నుంచి నేరుగా హిమాలయ పర్వత ప్రాంతాలకు బైక్ పై వెళ్ళారట అజిత్. ఆయన తోపాటు కోయంబత్తూరుకు చెందిన అన్నాడీఎంకే కౌన్సిలర్ సెంథిల్ అలాగే పలువురు స్నేహితులు కూడా ఉన్నారు. అజిత్ AK61 మూవీ తాజా షెడ్యూల్ షూటింగ్ విశాఖలోని అరకు ప్రాంతంలో జరుగుతోంది. అజిత్ తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసి అటునుంచి తన స్నేహితులతో కలిసి హిమాలయాలకు వెళ్లారట అజిత్.