Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయాలు దక్కించుకోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. బోయపాటికి కూడా అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రీజర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాకూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. అలాగే ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ సింగిల్ ‘అడిగా అడిగా’ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. అందమైన ఈ మెలోడీ శ్రోతలను ఆకట్టుకుంటుంది.
ఎస్.ఎస్ థమన్ ట్యూన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ ఆకట్టుకుంటుంది. ‘అడిగా అడిగా.. పంచ ప్రాణాలు నీ రాణిగా.. అంటూ సాగే ఈ పాటను ఎస్పీ చరణ్ -ఎంఎల్ శృతి కలసి అద్భుతంగా ఆలపించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు – శ్రీకాంత్ – పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి..