Aishwarya Rajesh: ఆ వెదవలను వదలొద్దు అంటూ ఫైర్ అయిన హీరోయిన్.. అసలేమైందంటే

|

Sep 30, 2022 | 11:44 AM

సెలబ్రెటీలు పబ్లిక్ లోకి వెళ్తే ఎప్పుడు ఎవరో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అభిమానులను కలవాడనికి కొంతమంది హీరోయిన్స్ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.

Aishwarya Rajesh: ఆ వెదవలను వదలొద్దు అంటూ ఫైర్ అయిన హీరోయిన్.. అసలేమైందంటే
Aishwarya Rajesh
Follow us on

సామాన్యులనుంచి నుంచి సెలబ్రెటీల వరకు చాలా మంది చేదుఅనుభవాలను ఎదుర్కొంటు ఉంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలకు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. సెలబ్రెటీలు పబ్లిక్ లోకి వెళ్తే ఎప్పుడు ఎవరో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అభిమానులను కలవాడనికి కొంతమంది హీరోయిన్స్ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీద చేతులు వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి సంఘటనలు గురించి మీడియా ముఖంగా చెప్పారు కూడా.. ఇటీవలే ఓ హీరోయిన్ తనను అసభ్యంగా తాకడానికి ఒక వ్యక్తి చెంప పగలగొట్టింది కూడా.. ఇంకొంతమంది సామాన్యులపై జరిగే విషయాల పై కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా మరో హీరోయిన్ కూడా అలాంటి సంఘటన గురించే మాట్లాడింది.. అందాల భామ ఐశ్వర్య రాజేష్ తాజాగా ఓ సంఘటన గురించి తెలిపింది.

ఐశ్వర్య రాజేష్.. ఈ బ్యూటీ గూరించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పేరుతెచ్చుకుంది. అయితే చిన్న తనం నుంచి ఐశ్వర్య చాలా కష్టాలు ఎదుర్కొంది. ఆమె తండ్రి రాజేష్ కూడా నటుడే.. చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలతో అయన మరణించడంతో కుటుంబ భారమంతా ఐశ్వర్య రాజేష్ పై పడింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ తన సొంత టాలెంట్ తోనే పైకొచ్చింది. నటి గా తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆ తరువాత తెలుగులోనూ హీరోయిన్ గా నటించింది. కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తరువాత వరల్డ్ ఫేమస్, టక్ జగదీష్ సినిమాలతో అలరించింది ఈ భామ. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

ఇవి కూడా చదవండి

ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఓ ఆటో డ్రైవర్‌ చేసిన పని పై ఐశ్వర్య రాజేష్ స్పందించింది. చెన్నైలో ఉన్న ఏ.సీ.జే ఇండియా కాలేజ్‌లో జర్నలిజం కోర్సు చదువుతున్న ఇషితా సింగ్‌ అనే యువతి ఈ మధ్యనే తన ఉరికి వెళ్లి తిరిగి వచ్చింది. ఓ హోటల్ దగ్గరకు వెళ్లేందుకు తన స్నేహితురాలితో కలిసి ఆమె ఆటోను ఎక్కింది. అయితే ఆ ఆటో డ్రైవర్ ఆమె తో తప్పుగా ప్రవర్తించాడు. ఈమె శరీర భాగాలను అసభ్యంగా తాకాడు. దాంతో ఆమె అతడి పై మండిపడింది. పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేయగా.. అతడు అక్కడినుంచి పారిపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ విషయం పై ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ.. ‘‘  అలాంటి వెధవలను వదలకూడదు, వెంటనే కఠినంగా శిక్షించాలి. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులకు నా కృతజ్ఞతలు.  ఇషితా నువ్వు ధైర్యంగా ఉండు’’ అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.