సుశాంత్ మృతి కేసులో విచారణకు మహేశ్ భట్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సూసైడ్ కేసులో ముంబయి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
Sushant Singh Rajput Suicide case : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సూసైడ్ కేసులో ముంబయి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్ వాంగ్మూలాన్ని మరో రెండు రోజుల్లో తీసుకోనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. ఆయనతో పాటు కరణ్ జోహర్ మేనేజర్నూ విచారణకు పిలిచినట్లు తెలిపారు. అవసరమైతే కరణ్ను సైతం విచారిస్తామని స్పష్టం చేశారు. ఇక సుశాంత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న నటి కంగనా రనౌత్కూ సమన్లు జారీ చేసినట్లు మంత్రి వివరించారు.
సుశాంత్ చనిపోవడానికి అతని వృత్తిపరంగా జరిగిన సంఘటనలే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, సినిమా క్రిటిక్ రాజీవ్ మసంద్ సహా ఇప్పటి వరకు 37 మందిని విచారించారు. మరోవైపు ఇటీవలే డిస్నీ హాట్స్టార్లో విడుదలైన సుశాంత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.
Read More : రైతు కుటుంబానికి ట్రాక్టర్ పంపిన సోనూ..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్