Rajinikanth: రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన రజనీ దంపతులు.. ఫొటోలు షేర్‌ చేసిన సూపర్‌ స్టార్‌..

|

Oct 27, 2021 | 4:25 PM

దిల్లీ వేదికగా ఇటీవల జరిగిన 67వ జాతీయ చలనచిత్ర పురస్కార వేడుకల్లో ప్రముఖ నటుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దాదాసాహెబ్‌...

Rajinikanth: రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన రజనీ దంపతులు.. ఫొటోలు షేర్‌ చేసిన సూపర్‌ స్టార్‌..
Follow us on

దిల్లీ వేదికగా ఇటీవల జరిగిన 67వ జాతీయ చలనచిత్ర పురస్కార వేడుకల్లో ప్రముఖ నటుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దాదాసాహెబ్‌ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ రాజధానిలోనే ఉన్న ఆయన పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తున్నారు. సోమవారమే రాష్ట్రపతిని కలిసిన ఆయన బుధవారం మళ్లీ తన భార్య లతతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని నివాసానికి వెళ్లి నరేంద్రమోదీని కలిశారు. మోదీ కూడా రజనీకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన పర్యటనలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసుకున్న రజనీ కాంత్‌.. ‘గౌరవనీయులైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌, ప్రధాని నరేంద్రమోదీలను కలిశాను. వారి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు.

కండక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన రజనీకాంత్‌ తన స్టైల్‌, మేనరిజమ్స్‌తో సినీ ప్రియుల మనసుల్లో ‘సూపర్‌ స్టార్‌’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ కళామతల్లికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగానే తాజాగా దాదా సాహెబ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన ‘అన్నాత్తై (తెలుగులో పెద్దన్న)’ విడుదలకు రెడీగా ఉంది. రజనీతో పాటు మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్‌ ఈ సినిమాలో నటించనున్నారు. దీపావళి కానుకగా నవంబర్‌ 4 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

RGV in AP Politics: ఏపీ పాలిటిక్స్‌లోకి వర్మ..! ఇక మామూలుగా ఉండదు గా..! సెటైరికల్ కామెంట్స్.. (వీడియో)

Payal Rajput: గ్లామర్ షో తో కనువిందు చేస్తున్న పాయల్ అందాలు.. చూస్తే వారెవ్వా అనాల్సిందే

Tadap Trailer: ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన అహన్ శెట్టి..