Chiranjeevi Acharya Movie: మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా లాక్డౌన్తో ఈ మూవీ షూటింగ్కి బ్రేక్ రాగా.. త్వరలోనే మళ్లీ చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ఇక ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోన్న రామ్ చరణ్.. ఆ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారట. అందుకోసం రాజమౌళి నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను కాస్త పెంచమని చిరంజీవి, కొరటాలను కోరారట. కొన్ని పవర్ఫుల్ సన్నివేశాలు, అలాగే రెండు పాటలు ఉండేలా చూడమని అడిగారట. తామిద్దరం కలిసి నటించే అవకాశాలు చాలా తరచుగా వస్తాయని భావించిన చిరు, కొరటాలకు రిక్వెస్ట్ చేశారట. ఈ క్రమంలో కొరటాల కూడా ఓకే చెప్పి స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్కి ఓ హీరోయిన్ని కూడా కొరటాల సెట్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఆచార్యలో చెర్రీ 40 నిమిషాల పాటు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చిరు, చెర్రీ ఇద్దరు కలిసి ఉన్న సన్నివేశాల కోసం కొరటాల ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు టాక్. అయితే ఆచార్య మూవీ ద్వారా తన తల్లి సురేఖ కోరిక నెరవేరబోతుందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెర్రీ వెల్లడించారు.
కాగా ఈ సినిమాలో చిరు సరసన కాజల్ మరోసారి జత కట్టబోతోంది. సోనూసూద్, అజయ్, హిమజ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రెజీనా ఓ ప్రత్యేక పాటలో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్తో పాటు మిగిలిన వారిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Read More:
ప్రభాస్ సోదరుడిగా అథర్వ మురళి..!