Crime News: ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం..! విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురు మృతి

|

Apr 10, 2022 | 7:14 AM

Girls Died in Bihar: ఆరుగురు బాలికలు.. చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్లు.. అందరూ ఆడుతూపాడుతూ కలిసికట్టుగా బడికెళ్లి చదువుకునే వారు. ఏమైందో ఏమో కానీ వారంతా ఒకేసారి విషం తాగారు.

Crime News: ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం..! విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురు మృతి
Crime News
Follow us on

Girls Died in Bihar: ఆరుగురు బాలికలు.. చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్లు.. అందరూ ఆడుతూపాడుతూ కలిసికట్టుగా బడికెళ్లి చదువుకునే వారు. ఏమైందో ఏమో కానీ వారంతా ఒకేసారి విషం తాగారు. ఆరుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని ఔరంగాబాద్‌ (Aurangabad) లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆరుగురు బాలికలు ఒకేసారి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఔరంగబాద్‌లోని కాస్మా ప్రాంతంలోని చిరాయిలాకు చెందిన ఆరుగురు బాలికలు స్నేహితులు. వీరి వయస్సు 12 నుంచి 16 ఏళ్లు ఉంటుందని రఫీగంజ్ ఇన్స్‌పెక్టర్ ఎంకే చౌదరి పేర్కొన్నారు. వీరంతా చెరువు వద్దకు వెళ్లారని.. అనంతరం పొలంలో విషం తాగారని పేర్కొన్నారు. వారిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారని.. అప్పటికే ముగ్గురు మరణించినట్లు డాక్టర్లు పేర్కొన్నారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అయితే.. ఇందులోని ఓ బాలిక యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలిసిందని.. బఘెరా సర్పంచ్ అనూజ్ సింగ్ తెలిపారు. అయితే.. ఆ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలిక విషం తాగినట్లు పేర్కొన్నారు. అయితే వీరంతా కలిసిన చోట ఏం జరిగిందో ఏమో కానీ.. ఆరుగురు ఒకేసారి విషం తాగి ఆత్మహత్యకు యత్నించారన్నారు. ప్రస్తుతం ముగ్గురు బాలికలు మగధ్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు.

Also Read:

AP Crime: ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని.. ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

Andhra Pradesh: ఇంట్లో చొరబడిన దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యజమాని.. షాకింగ్ వీడియో మీకోసం..!