అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యనే కిడ్నాప్ చేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే.. మహ్మద్ షరీఫ్ (74) అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు చేసిన షరీఫ్.. తన ఆస్తులు ఇద్దరి కుమార్తెలకు చెందుతాయని గతంలోనే వీలునామా రాశాడు. 2014లో రెండో కుమార్తె అస్మాని సల్మాన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంత కాలంగా బాగానే ఉన్న సల్మాన్.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పిల్లలతో కలిసి తండ్రి వద్దకు వెళ్లింది. నిన్న తండ్రితో కలిసి ఆస్పత్రికి వెళ్తుండగా.. సల్మాన్ తన స్నేహితులతో వచ్చి అస్మాను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటనపై వెంటనే షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు.
Read More: పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా పాజిటివ్
హైదరాబాద్లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్
నా కాపురం నయనతార వల్లే కూలిపోయింది.. ప్రభుదేవ మాజీ భార్య ఫైర్..
‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?