Andhra Pradesh: పెళ్లి రోజని బీచ్‌కు వెళ్లిన దంపతులు.. అంతలోనే అనుకోని ప్రమాదం. అసలేమైందంటే..

|

Jul 26, 2022 | 7:37 AM

Andhra Pradesh: విశాఖపట్నంలో దారుణం జరిగింది. బీచ్‌లో వివాహిత గల్లంతైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

Andhra Pradesh: పెళ్లి రోజని బీచ్‌కు వెళ్లిన దంపతులు.. అంతలోనే అనుకోని ప్రమాదం. అసలేమైందంటే..
Representative Image
Follow us on

Andhra Pradesh: విశాఖపట్నంలో దారుణం జరిగింది. బీచ్‌లో వివాహిత గల్లంతైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ ఎన్‌ఏడీ సంజీవ నగర్‌లో శ్రీనివాస్‌, సాయిపల్లవి నివాసం ఉంటున్నారు. పెళ్లి రోజు కావడంతో సరదాగా గడపడానికి సోమవారం సాయంత్రం విశాఖ ఆర్‌కే బీచ్‌కు వెళ్లారు. ఆ సమయంలో సాయి పల్లవి గల్లంతైంది.

దీంతో వెంటనే అలర్ట్‌ అయిన భర్త శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సముద్రం ఒడ్డున సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో తనకు మెసేజ్‌ రావడంతో బయటకు వచ్చానని, తిరిగి వెనక్కి చూసే సరికి భార్య కనిపించలేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలకు బ్రేక్‌ పడింది.

దీంతో తిరిగి మంగళవారం ఉదయం పోలీసులు మళ్లీ సెర్చ్‌ ప్రారంభించారు. సాయిపల్లవి నిజంగానే సముద్రంలో కొట్టుకుపోయిందా? లేదా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. దగ్గరల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పెళ్లి రోజున ఇలా జరగడంతో అటు శ్రీనివాస్‌, ఇటు సాయిపల్లవి కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..