సమాజంలో రోజు రోజుకీ విలువలు తగ్గిపోతున్నాయడానికి జరుగుతోన్న నేరాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డబ్బు కోసం కొందరు ఎంతటి దారుణానికైనా దిగజారుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణం అందరినీ షాకింగ్ గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన షాలూ, మహేశ్ చంద్ భార్య భర్తలు. వీరికి ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో షాలూ కొన్ని రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. అయితే తమ మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలంటే 11 వారాల పాటు పూజా చేయాలని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని భార్యను నమ్మించాడు మహేశ్.
ఇందులో భాగంగానే తెల్లవారు జామున హనుమాన్ ఆలయానికి వెళ్లాలని చెప్పాడు. దీంతో భర్త మాటలు నమ్మిన షాలూ.. వెళ్లడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఓరోజు ఉదయం సోదరుడితో ఆలయానికి వెళ్తోన్న సమయంలో షాలూను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన సోదరుడు చికిత్స పొందుతున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదట ఇది ప్రమాదమేనని భావించిన పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ విషయాలు తెలిశాయి.
షాలూను భర్త మహేశ్ చంద్ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తమదైన స్టైల్లో అడగడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇలా చేశానని ఒప్పుకున్నాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం షాలూకు ఇన్సూరెన్స్ చేయించాడు మహేశ్. సాధారణ మరణమైతే రూ.కోటి, యాక్సిడెంట్లో చనిపోతే రూ.1.90 కోట్లకు 40 ఏండ్ల కాలానికి పాలసీ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే రౌడీ షీటర్ ముఖేశ్ సింగ్తో కలిసి ఆమె హత్యకు ప్లాన్ చేశాడు. భార్యను చంపి ఇన్సూరెన్స్ మొత్తాన్ని కొట్టేయాలని కన్నింగ్ ప్లాన్ చేశాడు. కానీ కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఊసలు లెక్కిస్తున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..