ప్రభుత్వం మీ ఖాతాలో జమచేసిన రూ.1500/- క్రెడిట్ అయ్యాయో లేదో ఇలా చూడండి..

| Edited By:

Apr 20, 2020 | 5:28 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. రోజు వారిగా పనులకు వెళ్లేవారికి మొదలు.. చిరు ఉద్యోగస్థులంతా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలందరికీ రూ.1500/- వేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే వీటిని మూడు విడతలుగా నెలకు రూ.500/- గా సదరు లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వైట్‌ […]

ప్రభుత్వం మీ ఖాతాలో జమచేసిన రూ.1500/- క్రెడిట్ అయ్యాయో లేదో ఇలా చూడండి..
Follow us on

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. రోజు వారిగా పనులకు వెళ్లేవారికి మొదలు.. చిరు ఉద్యోగస్థులంతా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలందరికీ రూ.1500/- వేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే వీటిని మూడు విడతలుగా నెలకు రూ.500/- గా సదరు లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వైట్‌ రేషన్ కార్డు కలిగి ఉన్న అందరికీ రూ.1500/- జమచేస్తోంది. ఇప్పటికే దాదాపు అందరి అకౌంట్లలో జమచేసేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంతో మంది ప్రజలు వారి అకౌంట్లలో ప్రభుత్వం జమచేసిన డబ్బులు జమ అయ్యాయా.. లేదా అన్న దానిపై తర్జన బర్జన పడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం వివరాలను వEpos వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. సదరు లబ్దీదారు.. డబ్బులు పడ్డాయో లేదో అన్నది తెలుసుకునేందుకు ఆ పోర్టల్‌లో ఓ ఆప్షన్ పెట్టింది. ఇందులో రేషన్ కార్డు నంబరు ఎంటర్‌ చేసి నగదు జమకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

https://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html

Also Read:

దారుణ ఘటన.. సాధువులపై మూకదాడి.. ముగ్గురు మృతి..!