కనికాను ‘వీడనంటున్న కరోనా’.. మూడోసారీ పాజిటివ్ !

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ని కరోనా వీడనని అంటున్నట్టే ఉంది. ఆమెకు టెస్ట్ చేయగా మూడోసారి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఈ రిపోర్టు మంగళవారం రాత్రి అధికారులకు అందింది. ఆదివారం రెండో సారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతోంది. కనీసం రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ అని వచ్ఛేవరకూ ఆమెకు చికిత్స […]

కనికాను 'వీడనంటున్న కరోనా'.. మూడోసారీ పాజిటివ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2020 | 4:19 PM

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ని కరోనా వీడనని అంటున్నట్టే ఉంది. ఆమెకు టెస్ట్ చేయగా మూడోసారి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఈ రిపోర్టు మంగళవారం రాత్రి అధికారులకు అందింది. ఆదివారం రెండో సారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతోంది. కనీసం రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ అని వచ్ఛేవరకూ ఆమెకు చికిత్స కొనసాగుతుందని ఈ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె.ధీమన్ స్పష్టం చేశారు. అయితే కనికాతో బాటు హోటల్లో ఆమెతో ఉన్న ఆమె స్నేహితుడు ఓజాస్ దేశాయ్ కి టెస్టుల్లో నెగటివ్ అని వఛ్చినట్టు తెలిసింది. ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్ లో తాను కరోనా టెస్ట్ చేయించుకున్నానని,  ఆ టెస్టులో తనకు నెగెటివ్ అని తేలిందని అంటూ ఆయన.. ఆ టెస్ట్ తాలూకు రిపోర్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా ఉండగా.. ఇటీవల కనికా కపూర్ ఇఛ్చిన డిన్నర్ కు హాజరైన ప్రముఖ పొలిటిషియన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలందరికీ టెస్టుల్లో నెగెటివ్ అని తేలింది. దీంతో వాళ్లంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

తన కరోనా పాజిటివ్ లక్షణాలు దాచిపెట్టిన కనికా కపూర్ పై లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.