తెలంగాణ జోగులాంబ గద్వాల ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయింది. దీంతో ఆస్పత్రిలోని రోగులు పరుగులు పెట్టారు. ఉన్నట్టుండి భారీ శబ్ధం రావడంతో.. జనం గందరగోళంతో బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ అందక వెంటిలేటర్పై ఉన్న కృష్ణయ్య అనే వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆత్మకూరుకు చెందిన కృష్ణయ్య ఆయాసంతో నిన్న ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతన్ని వెంటలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇంతలోనే ఆక్సిజన్ లీక్ అయిన ఘటన జరగడంతో.. వెంటిలేటర్పై ఉన్న కృష్ణయ్యను బయటకు తీసుకొచ్చారు. దీంతో కృష్ణయ్య ఊపిరి అందక మృతి చెందినట్టు సమాచారం.
Read More:
షాకింగ్ న్యూస్: కళ్ళద్దాలపై 9 రోజుల పాటు కరోనా?
వికలాంగుడిగా కనిపించనున్న యంగ్ హీరో?
కేజీఎఫ్-2లో ప్రకాష్ రాజ్ పాత్ర అదేనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!