India Covid-19: కరోనా మృత్యుతాండవం.. దేశంలో గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు.. ఎన్నంటే..?

|

Jun 10, 2021 | 10:02 AM

India Corona Updates: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా కేసుల నుంచి కోలుకుంటున్న సమయంలో.. దేశంలో కరోనా మరణాలు ఆందోళనకు

India Covid-19: కరోనా మృత్యుతాండవం.. దేశంలో గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు.. ఎన్నంటే..?
India Covid-19 Deaths
Follow us on

India Corona Updates: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా కేసుల నుంచి కోలుకుంటున్న సమయంలో.. దేశంలో కరోనా మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. బుధవారం కరోనా బారిన పడి 6,148 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ప్రారంభం నాటినుంచి ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మోదటిసారి. కాగా.. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 94,052 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121 కి పెరగగా.. మరణాల సంఖ్య 3,59,676 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. నిన్న ఈ మహమ్మారి నుంచి 1,51,367 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,76,55,493 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,67,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 23,90,58,360 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read:

Covid Children: పిల్లలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వద్దు, తప్పదనుకుంటేనే సీటీ స్కాన్, స్టెరాయిడ్స్.. కరోనా చికిత్సపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం.. కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే ఉద్యోగికి 15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్!