ఐపీఎల్‌కు ఆతిధ్యం ఇస్తానన్న శ్రీలంక.. స్పందించిన బీసీసీఐ

|

Apr 17, 2020 | 6:53 PM

కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. అయితే ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం మరో విండో తప్పకుండా చూస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఈ తరుణంలో శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఐపీఎల్‌కు తాము ఆతిధ్యం ఇస్తానంటూ ముందుకు వచ్చింది. భారత్ కంటే ముందుగానే శ్రీలంకలో కరోనా ప్రభావం కంట్రోల్ అవుతుందని.. అందువల్ల తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించడంలో భాగంగా బీసీసీఐకు త్వరలోనే లేఖ రాస్తామని […]

ఐపీఎల్‌కు ఆతిధ్యం ఇస్తానన్న శ్రీలంక.. స్పందించిన బీసీసీఐ
Follow us on

కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. అయితే ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం మరో విండో తప్పకుండా చూస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఈ తరుణంలో శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఐపీఎల్‌కు తాము ఆతిధ్యం ఇస్తానంటూ ముందుకు వచ్చింది. భారత్ కంటే ముందుగానే శ్రీలంకలో కరోనా ప్రభావం కంట్రోల్ అవుతుందని.. అందువల్ల తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించడంలో భాగంగా బీసీసీఐకు త్వరలోనే లేఖ రాస్తామని ఎస్‌ఎల్‌సి అధ్యక్షుడు షమ్మీ సిల్వా అన్నారు. కాగా, ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,000 పైచిలుకు ఉండగా.. శ్రీలంకలో కేవలం 238 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

మరోవైపు శ్రీలంక ఐపీఎల్‌కు ఆతిధ్యం ఇస్తానన్న కథనాలపై బీసీసీఐ స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఐపీఎల్ నిర్వహణ ప్రస్తుతం అసాధ్యమని బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము లీగ్ నిర్వహణ గురించి ఆలోచించట్లేదన్న ఆయన.. లంకలో కేవలం మూడు స్టేడియంలు మాత్రమే ఉన్నాయని.. అంతేకాకుండా అక్కడ వనరులకు కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

Also Read:

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

‘కరోనా వైరస్’ను మొదటగా కనుగొన్నది ఓ మహిళ.. ఆమె గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కరోనా ‘బయో వార్’ నిజమేనా..? మృతుల సంఖ్యను పెంచేసిన చైనా.

‘రంజాన్’ ముగిసేవరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ప్రధానికి ముస్లిం కార్యకర్త వినతి..

‘ఫోన్ పే’లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై సరుకులు ఇంటి నుంచే ఆర్డర్ చేయొచ్చు..