AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 8,766 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

|

Jun 09, 2021 | 6:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త‌గా 24 గంటల వ్య‌వ‌ధిలో 93,511 క‌రోనా టెస్టులు చేయ‌గా.. 8,766 కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసులతో కలిపి....

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 8,766 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా
Ap Corona
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త‌గా 24 గంటల వ్య‌వ‌ధిలో 93,511 క‌రోనా టెస్టులు చేయ‌గా.. 8,766 కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,79,773 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధ‌వారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. కొత్త‌గా కరోనా కార‌ణంగా 67 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఫ‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,696కి చేరింది. కొత్త‌గా 24 గంటల వ్యవధిలో 12,292 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 16,64,082కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,995 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,00,39,764 శాంపిల్స్ వైద్యారోగ్య‌ శాఖ పరీక్షించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,980, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 265 కేసులు వెలుగుచూశాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు ఫైన్ వేసిన ఏపీ స‌ర్కార్

మాన‌వీయ విలువ‌లు చూపించ‌కుండా.. ప్ర‌జ‌ల్ని పీడిస్తున్న ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కొవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్సు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 72 కేసుల్లో వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు జరిమానా విధించినట్లు ఏపీ స‌ర్కార్ తెలిపింది. ఇటీవల చేసిన దాడుల్లో రూ.11.30 కోట్ల మేర ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెఇపారు. మొత్తం 94 ఫిర్యాదుల్లో 72 ఫిర్యాదులు ఆస్పత్రుల్లో అవకతవకలపై వచ్చాయని వివ‌రించారు. ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయటం, అత్యవసర ఇంజెక్షన్ల విషయంలో అవకతవకలపై ఈ కంప్లైంట్లు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆస్పత్రుల వెలుపల కూడా మరో 22 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి అత్యధికంగా రూ.4.53 కోట్ల మేర జరిమానా వసూలు చేసినట్లు స్పష్టం చేసింది.

Also Read: “విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా మాన‌వత్వం చూప‌రా…?” ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు ఫైన్ వేసిన ఏపీ స‌ర్కార్

ప్ర‌కాశం జిల్లాలో బ‌య‌ట‌ప‌డ్డ పురాత‌న‌ వెండి నాణేలు.. ఎగ‌బ‌డ్డ స్థానికులు.. వ‌చ్చిప‌డ్డ పోలీసులు