సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!

| Edited By: Pardhasaradhi Peri

Mar 16, 2020 | 4:59 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన పార్టీ నేత, నటుడు నాగబాబు సెటైర్స్ వేశారు. ఎన్నికల కన్నా, మన డబ్బు కన్నా, మన వ్యాపారలకన్నా, మన పదవుల కన్నా.. మనిషి ప్రాణాలే..

సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన పార్టీ నేత, నటుడు నాగబాబు సెటైర్స్ వేశారు. ఎన్నికల కన్నా, మన డబ్బు కన్నా, మన వ్యాపారలకన్నా, మన పదవుల కన్నా.. మనిషి ప్రాణాలే ముఖ్యం కదా అంటూ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం కరోనా తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమై.. స్కూళ్లను, కాలేజీలను, సినిమా థియేటర్లను ఈ నెల 31వ తేదీ వరకూ బంద్ చేశారు. అలాగే.. ప్రజలు ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. తగిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అలాగే కరోనా పేషంట్లకు ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో రాజకీయంగా ఈ విషయం పెద్ద దుమారంగా మారింది.

ఉన్నట్టుండి ఎన్నికలను వాయిదా వేయడంపై సీఎం జగన్.. ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. అటు ఈసీ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారుతోంది. అధికార పక్షంపై.. ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ వివాదంపై జనసేన నేత నాగబాబు కూడా ట్వీట్టర్‌లో స్పందించారు.

‘ఎన్నికలకన్నా, మన డబ్బు కన్నా ,మన వ్యాపారాలకన్నా, మన పదవుల కన్నా, ఇలా అన్నిటికన్నా.. మనిషి ప్రాణాలు ముఖ్యం కదా..! ఎన్నికలు ఆపలేదు.. postpone చేశారు. ఈ ఎలక్షన్ అకౌంట్‌లో కరోనా ఎఫెక్ట్‌కి ఒక్క ప్రాణం పోయినా పోయినట్టే కదా. అయినా వైసీపీ వాళ్ళకి.. వాళ్ళ సపోర్టర్స్‌కి ఎందుకు ఇంత బాధ’.. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుం ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది.

Read More this also: సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ

ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!

‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!

రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!

అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..