Congress VS Governor: దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. గవర్నర్కు కాంగ్రెస్ నేతల సవాల్..
Congress VS Governor: పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. ఇద్దరి..
Congress VS Governor: పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. ఇద్దరి మధ్య కనీసం పొసగడం లేదు. దాంతో నిత్యం పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఇద్దరి మధ్య మళ్లీ వివాదం ముదిరింది. గవర్నర్ కిరణ్ బేడీ తీరును నిరసిస్తూ పుదుచ్చేరి వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగారు. కిరణ్ బేడీని బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో రెండు రోజుల క్రితం పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి సైతం ధర్నా చేశారు. ప్రభుత్వ పథకాల్లో గవర్నర్ కిరణ్ బేడీ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కిరణ్ బేడీ జోక్యం కారణంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదని కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కిరణ్ బేడీకి దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. నామినేటెడ్ పోస్టులో కూర్చుని పెత్తనం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. కాగా, పుదుర్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీ నియామకం అయ్యింది మొదలు.. ఇప్పటి వరకు ఏదో అంశంలో అటు ప్రభుత్వం.. ఇటు గవర్నర్ మధ్య తీవ్ర వివాదాం చెలరేగుతూనే ఉంది. తాజాగా మరోసారి వివాదం చెలరేగింది. మరి ఈసారి పరిస్థితులు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.
Also read:
Bus Collided :విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం.. ప్రమాద తీవ్రతకు ఉలిక్కిపడిన స్థానికులు..